NGKL: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మైనింగ్ చేస్తే వారిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, మైనింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.