BHNG: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా బీబీనగర్ మండలం గొల్లగూడెం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పార్వతి మాధవి కుమార్ విజయం సాధించారు. ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడగా పార్వతీ మాధవి కుమార్ 341 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.