పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 58 లక్షల ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ‘ప్రత్యేక సమగ్ర సవరణ’లో భాగంగా ఎలక్టోరల్ రోల్స్ ప్రచురణ ప్రక్రియ మొదలైంది. రేపటి నుంచి ఈ కొత్త జాబితా అందుబాటులోకి రానుంది. బోగస్ ఓట్ల ఏరివేతలో భాగంగానే ఈ భారీ ప్రక్షాళన చేపట్టినట్లు సమాచారం.