ADB: కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపే విధంగా సిలిండర్ ధరలను పెంచిందని, వెంటనే తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొట్నాక్ దేవిదాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఆదిలాబాద్లో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే సిలిండర్లను తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.