PDPL: గోదావరిఖని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో చేపట్టే దసరా పండుగ ఉత్సవాలను తాత్కలికంగా వాయిదా వేసినట్లు సింగరేణి ఆర్జీ 1 యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిస్థితులను పరిశీలించి తాత్కలికంగా వాయిదా వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపింది.