NLG: జిల్లాలో వ్యవసాయ డిజిటలైజేషన్ లక్ష్యంగా సాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం 60 శాతం మాత్రమే నమోదైందని, రిజిస్ట్రేషన్ లేకపోతే పీఎం కిసాన్, పంటల బీమా, సబ్సిడీలు అందవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు తమ ఆధార్, పాసుపుస్తకం, మొబైల్ నెంబరుతో వెంటనే నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు.