NRPT: దామరగిద్ద మండలం పిడెంపల్లికి చెందిన ఎడ్ల వెంకటప్ప కాన్కుర్తి ఎస్బీఐలో ప్రధానమంత్రి జీవనజ్యోతి పాలసీ కట్టాడు. ఇటీవల ఆయన మృతి చెందడంతో నామినీగా ఉన్న అతడి భార్య వెంకటమ్మకు ఎస్బీఐ మేనేజర్ రవీందర్ పాలసీకి సంబంధించిన రూ.2 లక్షల చెక్కును గ్రామస్థుల సమక్షంలో బాధితురాలికి అందజేశారు. ఎస్బీఐ ఖాతాదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ రవీందర్ సూచించారు.