SRCL: సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్ను బుధవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. స్లాటర్ హౌస్ నిర్మించి అన్ని విక్రయాలు పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు.