MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణ పక్షం ద్వాదశి భాను వాసరే పురస్కరించుకొని అర్చకులు పార్థివ శర్మ అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి, సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు.