BHNG: భువనగిరి పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు చొల్లేటి శ్రీనివాసాచారి ఈనెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సూక్ష్మ సైజులో పోలీసు అమరవీరుల స్థూపాన్ని తయారు చేశారు. 40 గ్రాముల వెండితో 4 ఇంచుల ఎత్తులో రూపొందించి ఔరా అనిపించారు. ఆయన గతంలోనూ, బంగారం, వెండితో వీసా టవర్, క్రికెట్ స్టేడియం, క్రికెట్ వరల్డ్ కప్ వంటివి తయారు చేశారు.