MDK: నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామం నుంచి చల్మెడ కమాన్ సుమారు ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు పూర్తిగా కంకర పోసి వదిలేశారు. దీంతో ఇరు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు ఈ రోడ్డుపై రామాయంపేటకు వెళ్తూ ఉంటారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఇరు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.