KMM: ఉమ్మడి జిల్లాలోని ఆయిల్పామ్ సాగుదారులు తెల్లదోమ ఉద్ధృతితో బెంబేలెత్తుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్న తోటలపై ఈ తెగులు పంజా విసరడంతో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. దీని వల్ల కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతిని, గెలల సైజు తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.