NLG: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బంగారుగడ్డ, అవంతిపురం ఈద్గాల వద్ద శనివారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన అనంతరం ఆయన వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, ధార్మిక చింతనకు నిలువుటద్దమని కొనియాడారు.