RR: మైలార్దేవుపల్లిలో డ్రైనేజీ పైప్లైన్ పనులు పూర్తయినా, రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తవ్విన రహదారులు బురదమయంగా మారి, ప్రజలు నడవడానికి కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. స్వల్ప వర్షానికే పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.