KMM: మధిర మండలం ఆత్కూరు గ్రామ సమీపంలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద స్థలాన్ని ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటల పరిస్థితిపై సమీక్ష నిర్వహించి బాధిత రైతులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.