MDK: తూప్రాన్ మండలం గుండారెడ్డిపల్లె గౌరీగుడం శివారులో వాగులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, హిటాచీ ప్రొక్లెయినర్ యంత్రంతో పాటు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.