NZB: వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 47 గ్రాముల చరాస్, 29 గ్రాముల గంజాయి, ఒక బైక్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో భీంగల్కు చెందిన అఖిల్, సోహైల్తో పాటు నాందేడ్కు చెందిన వ్యక్తి, వేల్పూరు చెందిన మైనర్ ఉన్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.