PDPL: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి పట్టణంలో హోలీ పండుగ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు అయోధ్య రవీందర్ హోలీ ప్రాముఖ్యతను హిందూ బంధువులకు వివరించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సంపత్, రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.