SDPT: కార్తీకమాసం చివరి మంగళవారం సందర్భంగా శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. సదరు సంస్థ అధ్యక్షుడు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రామరాజు మాట్లాడుతూ.. జనన మరణాలు దేహానికే గాని జీవునికి కాదన్నారు.