MHBD: వరి బదులు ఆయిల్ పామ్ సాగు చేయాలని జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న సూచించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గ్రామ గ్రామానా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ నూతన రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పంట మార్పిడి ద్వారా ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, మల్బరీ సాగుతో ఎకరానికి రూ. లక్ష ఆదాయం పొందవచ్చని తెలిపారు.