NLG: ఈనెల 16వ తేదీన పఠాన్చెరు, సంగారెడ్డి నందు జరిగిన 69వ SGF రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో NLG జట్టు తృతీయ స్థానం సాధించింది. జట్టు విజయంలో నిడమనూరు మండలం ZPHS పాఠశాల ఎర్రబెల్లికి చెందిన పిట్టల రాధ (9వ తరగతి) కీలక పాత్ర పోషించింది. విద్యార్థిని బుధవారం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.