KNR: ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం 80 శాతం దాటాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్, కేజీబీవీ ప్రిన్సిపాళ్లతో గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాశాఖపై సమీక్షించారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.