SRPT: మేళ్లచెరువు స్వయంభూ శంభు లింగేశ్వర దేవస్థానాన్ని చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం ఉదయం 7 గంటలకు మూసివేశారు. ఈవో నాగెళ్ల శంభిరెడ్డి, ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ద్వారబంధనం చేశారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.