MDK: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు గాను రూ. 111 కోట్లు చెల్లించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన పనులు ప్రారంభించి, నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.