KMM: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన శిక్షణ అందించాలని, కేంద్రంలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. ముదిగొండ మండలం రాఘవాపురంలోని ప్రాథమిక పాఠశాల భవిత కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల నమోదు, వారికి అందుతున్న విద్య, వైద్య సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.