BHPL: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, గురువారం సాయంత్రం మరిపెడ మండలానికి రానున్నారు. మండల కేంద్రంలో సా. 5:30 కి జరిగే దసరా వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోతు రామచంద్రనాయక్ సైతం పాల్గొంటారని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వీరి పర్యటనతో పాటు దసరా వేడుకలు విజయవంతం చేయాలని కోరారు.