PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలో గురువారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు సింగరేణి సంస్థకు చెందిన వైద్యులు గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, మందులను పంపిణీ చేశారు. గనుల ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని SO2- GM చంద్రశేఖర్ అన్నారు.