JGL: ఇబ్రహీంపట్నంలోని సీతారామచంద్ర ఆలయం పురాతన ఆలయాన్ని సుమారు 150 ఏళ్ల క్రితం పూర్తిగా రాయి, సున్నంతోనే శిల్పులు నిర్మించారు. ఆలయ మండపంలో ఏకశిల రాతితో ఏర్పాటుచేసిన 16 రాతి స్తంభాలు, ఆలయ నిర్మాణ శైలి అబ్బుర పరుస్తుంది. రాముడు, సీతాదేవి విగ్రహాలను భద్రాచలం రామాలయంలో లాగానే నల్లరాతితో చెక్కిన రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు.