BPT: పన్నుల వసూళ్లలో అద్దంకి మున్సిపాలిటీ రికార్డు సృష్టించింది. మార్చి 31 నాటికి జిల్లాలో మొదటి స్థానంలో, రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచినట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. మొత్తం రూ.5.71 కోట్ల లక్ష్యానికి గాను రూ.4.61 కోట్లు (80.5%) వసూలు చేసినట్లు పేర్కొన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన పట్టణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.