KNR: హుజురాబాద్ పట్టణంలోని 17వ వార్డు మామిళ్లవాడలో సోమవారం మున్సిపల్ రెస్క్యూ టీం ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఛైర్పర్సన్ రొంటాల సుహాసిని పర్యవేక్షణలో సిబ్బంది కుక్కలను బంధించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎండీ కాలిక్ హుస్సేన్, సొల్లు సునీత, కమిషనర్ ముసబ్ అహ్మద్, మేనేజర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.