SDPT: చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కొరటికంటి సరిత డాక్టరేట్ సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ కె.భాస్కర్ పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు గాను అధికారులు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేశారు. డాక్టరేట్ సాధించిన సరితను గ్రామమస్థులు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.