KMM: కారేపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున నాగళ్ళ వెంకటేశ్వర్లు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వేసవికాలం కావడంతో ఇంటికి తాళం వేయకుండా ఆరుబయట పడుకున్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల బీరువాలో ఉన్న లక్ష 18వేల రూపాయలను దొంగలు అపహరించుకుపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.