NRML: అక్రమంగా మొరం తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మంగళవారం సారంగాపూర్ మండలం జాం గ్రామ చెరువు సమీపంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మొరం, ఇసుక అక్రమ తవ్వకాలు లేదా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.