MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 5 డిపోల నుంచి ఈ నెల 27, 28, 29 వ తేదీల్లో 270 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ తెలిపారు. ఈ నెల 28న ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం రోజున అత్యధికంగా 150 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.