JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 24న మంగళవారం ఉదయం 10:30 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవదాయ , ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.