ADB: సైబర్ మోసాల పట్ల అప్రమత్తత అవగాహన ప్రజలకు తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. గతవారం రోజుల్లో 15 ఫిర్యాదులను స్వీకరించినట్టు వెల్లడించారు. ప్రతివారం జిల్లా సైబర్ క్రైమ్ బృందంచే గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నేరాలపై చైతన్య పరచడం జరుగుతుందని పేర్కొన్నారు.