MNCL: జన్నారం మండలం కేంద్రంలో గల సర్వే నంబర్ 374 అంబేద్కర్ భవనానికి వెళ్లే దారి మధ్యలో అక్రమంగా గోడని నిర్మించారని స్థానికులు తెలిపారు. నెల రోజులు అయినా ఎమ్మార్వో, గ్రామపంచాయతీ ఈవోకి పలుమార్లు దరఖాస్తు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి నిర్మించిన గోడను తొలగించాలని అంబేద్కర్ సంఘ నాయకులు కోరుతున్నారు.