NGKL: ఊర్కొండ మండలం రాచలపల్లి గ్రామ పరిధిలోని కాల్యా తండాలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. తండాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఎంపీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం MP డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు.