BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్ కార్పొరేటర్ బండి నరసింహారావు గురువారం పారిశుద్ధ్యం పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మెదరబస్తిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు రాకుండా దోమల నివారణకై కాలువలలో టిమోపాస్ దోమల మందు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రజలు వారంలో ఒకరోజు డ్రైడేను పాటించాలని నీరు నిలువ లేకుండా చూడాలన్నారు.