ADB: గుడిహత్నూర్ మండలంలోని బెల్లూరి గ్రామానికి చెందిన సూరిండ్ల జ్యోతి అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం సాయంత్రం పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది.