SRPT: ప్రతి మనిషికి సమాన హక్కులు,స్వేచ్ఛలు కలగాలి అనే గొప్ప లక్ష్యంతో పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను గౌరవించడం మాత్రమే కాదు, ఇతరుల హక్కులను కూడా కాపాడడం మనందరి బాధ్యత ఉందని అన్నారు. సమానత్వం, న్యాయం కాపాడాలన్నారు.