MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన కైతోజు స్వర్ణలత అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు మృతురాలు ఇంటికి వెళ్లి ఆమె పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కౌన్సిలర్ తదితరులు ఉన్నారు.