NRML: కడెం మండలం ఉడుంపూర్ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సందర్శించారు. వారికి కడం మండల బీజేపీ అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, గ్రామ పెద్దలు సంప్రదాయ బద్ధంగా గొంగడి వేసి, గొర్రె పిల్లను అందించి ఘన స్వాగతం పలికారు. కడం నుంచి కల్లెడ గ్రామం వరకు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు విస్తరించి నీటి సరఫరా కల్పించాలన్నారు.