ADB: సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.