KNR: ఉత్తరాంచల్ రాష్ట్రం హరిద్వార్లో ఈనెల 25 నుంచి జరిగే జాతీయస్థాయి టైక్వాండో పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు చొప్పదండి జెడ్పీహెచ్ఎస్ (బాలురు) విద్యార్థిని సౌమ్య ఎంపికైంది. పదవ తరగతి చదువుతున్న సౌమ్య రాష్ట్రస్థాయి పోటీలలో కరీంనగర్ జిల్లా తరఫున పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచిందని పిడి కృష్ణ తెలిపారు.