KMR: తెనుగోళ్ల (ముదిరాజుల) తొలి పండగగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో ముదిరాజులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. జెండా గద్దె రంగుతో అలకరించారు. అనంతరం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ఎగరవేస్తారు. ఈ వేడుకలు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతాయి.