NZB: ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరు గడువు అని సిరికొండ ఎంపీడీవో మనోహర్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న పత్రాలను మరుసటి రోజు ఉదయం 11 గంటలలోపు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.