JGL: ఉపాధి హామీ పథకం పనుల్లో సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని డీఆర్డీవో రఘువరన్ హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలోని రైతు వేదికలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికను శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఈ పథకంలో చేపట్టిన పనులపై తనిఖీ నిర్వహించి, ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శుల నుంచి రూ. 18 వేలను రికవరీ చేసి జరిమానా ఆదేశించారు.