RR: తిరుమల పవిత్ర లడ్డు కల్తీ చేశారని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు అన్నారు. ఇవాళ షాద్నగర్లో ఆయన మాట్లాడుతూ.. ఈ మహా పాపం మాజీ సీఎం వైఎస్ జగన్కు ఊరికే వదిలిపెట్టదని, తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదన్నారు. దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డూలను భక్తులకు పంపిణీ చేసి హిందువుల విశ్వాసాలతో ఆడుకున్నారన్నారు.