GDWL: గద్వాల మండల పరిధిలోని లత్తిపురం, బీరెల్లి గ్రామాల్లో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో శనివారం రైతులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విత్తన బిల్లును, భారత్-అమెరికా వ్యవసాయ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య డిమాండ్ చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలన్నారు.